గతంలో హర్టికల్చర్ అసిస్టెంట్లు లేక లక్ష్యాలు పూర్తి అయ్యేవి కాదని, తాజాగా సచివాలయ ఉద్యోగులు విధులలో చేరితే ఇపుడు ప్రభుత్వ లక్ష్యాలను అనుకున్న సమయానికి పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు హార్టికల్చర్ ఏడి శైలజ. సోమవారం ఉదయం తన ఇంట్లో కలసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానున్న గ్రామసచివాలయ వ్యవస్థ కోసం ఉద్యానవన శాఖకు విశాఖజిల్లాలో 423 పోస్టులు కేటాయింపు జరిగిందని నెలఖరునాటికి ఎంపికైన అభ్యర్ధులు విధుల్లోకి చేరతారని ఆమె వివరించారు. వీరి సేవలను పూర్తిగా వినియోగించుకుని లక్ష్యాలను చేరుకుంటామన్న ధీమా వ్యక్తం చేసారామె.