నవంబర్ 24 ఆదివారం వన సమారాధన ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు చెప్పారు. ఈమేరకు ఎం ఎఫ్ సి ఎల్ రోడ్ లో ఉన్న కాపు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం సర్వసభ్య సమావేశం జరిగినది. మాజీ హస్తకళల చైర్మన్ పంతం నానాజీ సారధ్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడిగా ఏసుదాసు ఎంపిక చేసారు. బసవ ప్రభాకర్ రావు అధ్యక్షత వహించిన ఈ సభలో సంఘ సభ్యులను ఉద్దేశించి ఏసుదాసు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని కాపు సంఘాలు ఏకగ్రీవంగా తనని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం కాపు వన సమారాధన కు తీసుకోవలసిన బాధ్యతలు పై పలు సూచనలు చేసారు. కాపు జాతి కోసం శ్రమిస్తున్న వారందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు.