నెల్లూరు జిల్లాలోని పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇందుకు ప్రయివేటు పాఠశాలపై దుష్ప్రచారం చేస్తూ కిడ్నాపర్లు కొత్తదారి పడుతుండటం, పాఠశాలల యాజమాన్యాలు ఏం చేయాలో పాలుపోక బిక్కచూపులు చూస్తున్నాయి. ఈమధ్య జిల్లాలో పిల్లల కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వొచ్చింది. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఉన్న ఐమైండ్స్ టెక్నో స్కూల్ లో చదువుతున్న విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి, పాఠశాల ప్రస్తుత యాజమాన్యం సరిగ్గా పనిచేయటం లేదని, స్కూల్ లో చదువులు కూడా ఏమి బాగోలేదని, అంతకంటే మంచి స్కూలు ఆరంభించానని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పడంతో పాటు పలు బ్రోచర్లు చూపిస్తు మీరంతా ఆడుకోవడానికి ఎన్నో సౌకర్యాలున్నాయి. ఓసారి వచ్చి చూడండి , వెంటనే తీసుకువచ్చి దింపేస్తాం అంటూ చిన్నారులను మభ్యపెట్టాడు.
సహజంగానే ఆటపాటలకు ఆకర్షితులైన కొందరు విద్యార్ధులు ఆ కళ్ళబొల్లు మాటలు నమ్మిక ఆతనితో బయలు దేరారు. తీరా వాహనం ఎక్కాక వేరేమార్గంలో వెళుతున్నామని గమనించి అరచి గీపెట్టి వాహనం ఆపుచేయించి ఇంటివైపు లగెత్తారు.
విషయం కాస్త ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రజల్లో తిరుగుతున్న కిడ్నాపర్ల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమ పిల్లలు కొంత అవగాహన ఉండటం తో ఆ కిడ్నాపర్ల నుండి బయట పడ్డారని, లేదంటే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. కాగా తమకు తెలిసిన పాఠశాలల పేర్లు చెపుతుండటంతో వారి వెంట వెళ్లామని, అయితే వారి తీరు అనుమానంగా ఉందని విద్యార్థులు చెపుతున్నారు. .ఇకనైనా సంభందిత అధికారుల చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు