హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రూ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ట్రూజెట్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయణీకులను ఇబ్బందుల్లోకి నెట్టింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా తిరిగా ల్యాండ్ చేశారు. విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.