ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో మరోమారు భూమి కుంగింది. ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలంలోని గూడవాండ్లపల్లెకు చెందిన రైతు సుబ్బారాయుడి పొలంలో ఆదివారం భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో పొలంలో 8 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతులో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యిని చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివస్తున్నారు. భూమి కుంగడానికి గల కారణం తెలియరాలేదు.