మరోమారు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల్ని జనసేనాని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చనిపోయినప్పుడు తాను చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో గుర్తు చేసుకున్నట్టే.. ఈసారీ తనకూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తన అన్నయ్య ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ ధైర్యం, గుండె బలాన్ని ఏ రోజు వదిలి పెట్టలేదన్నారు. అన్నయ్యలా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబంలో ఉండి ఉంటే ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారు కాదేమో అనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి బాగు కోరే వారు తన అన్నయ్య అన్నారు. దేశం గొప్పతనం చెప్పే ఈ సినిమా గాంధీ జయంతికి రిలీజవుతుండడం బావుందని స్ఫూర్తినిస్తుందని అన్నారు.