అక్టోబరు 4వ తేదీ గరుడసేవ సందర్భంగా తిరుమల ఘాట్రోడ్లలో ద్విచక్ర వాహనాల వాహనాల రాకపోకలను రద్దు చేపినట్టు తిరుమల భద్రతా విభాగం ప్రకటించింది. అక్టోబరు 3వ తేదీ అర్ధరాత్రి నుండి అక్టోబరు 5వ తేదీ ఉదయం 6.00 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని భక్తులంతా దీనిని గమనించుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.