బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండాటిటిడి విజిలెన్స్ విభాగం పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 4,700 మంది భద్రతా సిబ్బంది, 1500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా చూస్తామని విజిలెన్స్ అధికారులు చెప్పారు.