తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలకు వచ్చేయనున్న భక్తులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, మ్యూజియం, ఫొటో, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తున్నారు. పాపానాశనం రోడ్డులోని కల్యాణ వేదిక వద్ద టిటిడి గార్డెన్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వెలుపల, తిరుమలలోని ప్రధాన కూడళ్ల వద్ద భక్తులకు మరింత అహ్లాదం కలిగించేలా రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఇతర ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకర్షించేలా దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కళా బృందాలు కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.