శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో రంగురంగుల ఆకర్షణీయమైన ఎల్ఇడి లైట్లతో చేసిన తోరణాలను తిరుమల, తిరుపతి రహదారుల వెంబడి, డివైడర్ల మధ్య చెట్లకు అందంగా అలంకరించారు. అదేవిధంగా ప్రధాన కూడళ్ళలో, రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా భక్తులు వాహనసేవలు తిలకించేందుకు 37 డిస్ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. రేడియో, బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు ప్రకటనలు తేలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు.