తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల ప్రత్యేకాధికారి ఏ.వి.ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భక్తులందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేస్తున్నాయి.