చంద్రబాబు ఐదేళ్లలో ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదని, కానీ తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాగానే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగాలు కల్పిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఓర్వలేక పోతున్నారుంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు విమర్శలు చేసారు. ఆది వారం ఈ మేరకు ఉపముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అంజాద్ బాషా, ఆళ్ల నాని, పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి ఆదివారం చంద్రబాబుకు లేఖ పంపిస్తూ, మీడియాకు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాలు పారదర్శకంగా ఉన్నాయని, అయినా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం చూసి ఓర్వలేకే చంద్రబాబు జగన్కు లేఖ రాశారని, ఇది చంద్రబాబు అసూయకు అద్దంపడుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికాదన్న తీరుగా చంద్రబాబు వ్యవహారం ఉందని, ఆయన ఇక మారరని ప్రజలకు కూడా అర్ధమైందని వారు విమర్శించారు.