ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే దేశం లేకుండా చేస్తాంఃకిష‌న్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 09:38 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన జన జాగరణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్థాన్ తో యుద్ధం వస్తే ఆ దేశం ప్రపంచపటంలో లేకుండా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 ఏర్పాటు చేశారని.. అప్పుడు 42 వేల మంది చ‌నిపోయార‌న్నారు. ఆర్టికల్ 370 వల్ల గతంలో పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయని.. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 కారణంగా మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండవన్నారు. గత డబ్బై ఏళ్లలో కాశ్మీర్‌‌లో ఎలాంటి రిజర్వేషన్లు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అమలు కాలేదన్నారు కిషన్ రెడ్డి. ఆర్టికల్‌ 370 లాంటి చట్టాలు ఇటలీ, పాకిస్థాన్ వంటి దేశాల్లో ఉన్నాయా.. మన దేశంలో మాత్రం ఆర్టికల్‌ 370 ఎందుకు ఉండాలన్నారు. అందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌లో 65వేల టెర్రరిస్ట్‌ ఘటనలు జరిగాయి.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ కూడా పేలలేదన్నారు. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు కేంద్రమంత్రి. ఈ సారి యుద్ధం అంటూ జరిగితే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే దేశం లేకుండా చేస్తామని హెచ్చరించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాక్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com