విశాఖ జిల్లాలోని జీకేవీధి మండలం మాదిగమల్లులోని ధారకొండ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏజెన్సీలో మావోల కదలికలు ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు ఒక పథకం ప్రకారం వారిని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య భీకర స్థాయిలో కాల్పులు చోటుచేసుకోగా.. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు హతమార్చారు.