టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి వెళ్లిన బాబు.. ఆయన పార్ధీవదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. శివప్రసాద్కు నివాళులర్పిస్తానని ఊహించలేదన్నారు. ఇద్దరం మంచి మిత్రులమని, డాక్టర్గా ఉండి కళపై మమకారం పెంచుకున్నారని, తనపై నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చారని బాబు గుర్తుచేసుకున్నారు. శివప్రసాద్ రాష్ట్రం కోసం ఎనలేని పోరాటం చేశారని, ప్రజా సమస్యలను తన కళారూపంలో తెలియజేశారని.. ఆయన ఆజాత శత్రువని పేర్కొన్నారు.