దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దసరా ఉత్సవాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. 15లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు.