ఆరోగ్య శ్రీ సేవల మొత్తాన్ని పెంచాలని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల వైద్యులు డిమాండ్ చేశారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. 12 ఏళ్ల నుండి సేవల చెల్లింపు మొత్తాన్ని పెంచలేదన్నారు. 12 ఏళ్లుగా అలాగే సేవలు అందించామన్నారు. ఆస్పత్రి ఖర్చులు పెరుగుతున్నాయని సేవలు అందించడం కష్టం అవుతోందని, సమస్యలను సీఎం సృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.