ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. విశాఖ జిల్లా జీకే వీధి మండలం మాదిగమల్లులో పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ధారకొండ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు పెద్దఎత్తున తుపాకుల మోత మోగించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.