ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గీతం యూనివర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 01:19 PM

విశాఖపట్నంలోని గీతం డీమ్డ్‌ వర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికిగానూ ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వార ప్రవేశాలు కల్పించనున్నారు. పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్‌) స్కాలర్లుగా ఎంపికైనవారిలో ప్రతిభ కనబర్చిన వారికి 3 సంవత్సరాలపాటు 'మెరిట్ రిసెర్చ్ ఫెలోషిప్‌' కింద నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఫెలోషిప్ ఇవ్వనున్నారు.


విభాగాలు: ఇంజినీరింగ్, ఫార్మసీ, సైన్స్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లా.


అర్హత: సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి


దరఖాస్తు ఫీజు: రూ.3000. ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా


మెరిట్ ఫెలోషిప్: పీహెచ్‌డీ (ఫుల్‌టైమ్‌) స్కాలర్లుగా ఎంపికైనవారిలో మెరిట్ ప్రకారం 3 సంవత్సరాలపాటు నెలకు


రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఫెలోషిప్ ఇవ్వనున్నారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 14.10.2019


నోటిఫికేషన్: https://bit.ly/2msQwSW


అప్లికేషన్ కోసం లింక్: https://bit.ly/2kYu6IC


వెబ్ సైట్: www.gitam.edu






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com