కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసం సహా మరో 4 ఇళ్లను కూల్చివేసేందుకు అంతా సిద్ధమైంది. కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన 31 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. 20 కట్టడాలకు సంబంధించిన వాదనలు విన్న అధికారులు 5 ఇళ్లను కూల్చాలని నిర్ణయించి 5 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. వారంరోజుల్లో వారే ఇళ్లు కూల్చేయాలని లేకుంటే సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.