గోదావరిలో మరో మృతదేహం లభ్యమైంది. తూర్పుగోదావరి జిల్లా సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించారు. లాంచీ మునిగిన ఘటనలో గాలింపు బృందాలు ఇప్పటి వరకు మొత్తం 37 మృతదేహాలు వెలికి తీశారు. ఇంకా దొరకని పలు మృతదేహాల కోసం 8వ రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సేఫ్టీ బృందాలు పాల్గొంటున్నాయి. గోదావరిలో బోటును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బోటు ప్రమాద ప్రాంతంలో భరించలేని దుర్వాసన వస్తోంది. ప్రత్యేక అధికారి ఆదినారాయణ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.