ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. ఢిల్లి నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పిడుగుల ప్రభావానికి విమానం కొద్దిగా షేకైంది. విమానం షేక్ అవడంతో వస్తువులు, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి. విమానం షేక్ అవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. గన్నవరం ఎయిర్పోర్టులో విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానం సేఫ్ ల్యాండింగ్తో 150 మంది ఎయిర్ ఇండియా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.