సైరా’ విడుదల తేదీ అక్టోబరు 2 దగ్గరయ్యే కొద్దీ వివాదాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ‘సైరా’ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు తొలుత వివాదాన్ని రేపడంతో అది కాస్త కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. ఈ వివాదంపై చరణ్ కొత్త వాదం తెరమీదకు తెచ్చి, వందేళ్లు దాటితే ఎవరి కథైనా చరిత్ర అవుతుందని, దాన్ని సినిమాగా మలచుకునే హక్కు అందరికీ ఉంటుందని . మంగళపాండే కథని సినిమాగా తీస్తున్నప్పుడు ఇలాంటి వివాదాలే వచ్చాయని, అవేం నిలబడలేదని, కోర్టు తీర్పుని చరణ్ ప్రస్తావించాడు. పైగా ఉయ్యాలవాడ వంశస్తులకు ఇచ్చేది ఏం ఉండదని తేల్చి చెప్పారు కూడా.
అయితే తాజాగా మరోమారు ఉయ్యలవాడ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హీరో చిరంజీవి, నిర్మాత రామ్చరణ్లపై ఫిర్యాదు చేశారు. 23 మంది కుటుంబ సభ్యులకు రూ.50 కోట్లు ఇస్తామంటూ చెప్పారని, తీరా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.