ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం డ్యామ్‌ భద్రతను పట్టించుకోరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 01:07 AM

అవుకు టన్నెల్‌ పనులను పూర్తి చేయ‌ని మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా కు పోలవరం పనులు  క‌ట్ట‌బెట్ట‌డం ప‌ట్ల తీవ్రంగా విమ‌ర్శించింది తెలుగుదేశం పార్టీ. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో 20శాతం తక్కువ కోట్‌ చేశామని, త‌ద్వారా 50 కోట్లు రాష్ట్రానికి మిగిల్చామ‌ని  నీతులు చెబుతున్న మంత్రి అనిల్   రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొన్న మిగతా కంపెనీలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిల‌దీసారు మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.  15 ఏళ్ల క్రితం వైఎస్ హ‌యాంలోనే 21% త‌క్కువ అంటూ 343 కోట్ల‌కు అంచ‌నావేసి ప‌నులు అప్ప‌గించార‌ని అయితే ప‌నులు చేయ‌కుండా కాంట్రాక్ట‌రు పారిపోయాడ‌ని, కానీ గ‌త తెలుగుదేశం పార్టీ హ‌యాంలో 276 కోట్ల ఐబిఎం  విలువ చేరింద‌ని,  ఇది మ్యాక్స్ ఇన్‌ఫ్రా చేప‌ట్టింద‌ని, అన్నారు. ముందస్తు ఒప్పందం మేరకే మ్యాక్స్‌ ఇన్‌ఫ్రాకు ఇచ్చారని, కేంద్రం, పోలవరం అథారిటీ చెప్పినట్టు సీఎం జగన్‌ వినడంలేదన్నారు. జగన్‌ బంధువు నివేదిక ఆధారంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని దుయ్యబట్టారు. పోలవరం డ్యామ్‌ భద్రతను పట్టించుకోవడంలేదని, టీడీపీ హయాంలో పోలవరాన్ని 70శాతం పూర్తిచేశామని దేవినేని ఉమా తెలిపారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com