రివర్స్ టెండరింగ్ వలన రేట్లు పెరుగుతాయి అని గగ్గోలు పెడుతున్న విపక్షనేతలు అవిఎలా పెరుగుతాయో చెప్పాలని నిలదీసారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ . శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ తాము మొదటి నుంచి చెపుతున్నట్టే ప్రజా ధనం కాపాడేందుకే ముఖ్యమంత్రి సారధ్యంలో రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లామన్నారు, గతంలో ఏకంగా 300 కోట్ల టెనల్ వర్కులో 4.8 ఎక్సస్ వర్క్ని అదే కాంట్రాక్టరు ఇప్పుడు 15.6 లెస్ కి రివర్స్ టెండరింగ్ ద్వారా దక్కించుకున్నారని, దీని ద్వరా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అన్నారు. రివర్స్ టెండరింగ్ మొట్టమొదటి పనిలో ప్రభుత్వానికి 50 కోట్లు ఆదాయంతో ప్రారంభమైంది. నవంబర్ నుండి పోలవరం పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుంది అని స్పష్టం చేసారు మంత్రి అనీల్.