ఇటీవల తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు తోడు భారీగా పడుతున్న పిడుగులకు సామాన్యులు అకాల మృత్యు ముఖం పాలవుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సూళ్లూరు పేట మండలం సుగ్గుపల్లి గ్రామం లో శనివారం కురిన భారీ వర్షంలో పిడుగు పడటంతో పొలంలో పనిచేసుకుంటున్న తనమాల ధనుజయ రెడ్డి అనే వృద్ధుడు మృతి చెందారు. అందరితో కలివిడిగా ఉండి ఆప్యాయంగా పలుకరించే వ్యక్తి అకస్మాత్గా మరణించడం పట్ల గ్రామమంతా విషాధ ఛాయలు నిండుకున్నాయి.