కోమాలోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఒక వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. 1990లో ఒక వ్యక్తి కొంత నామమాత్రపు ధరకే ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన 20,000 షేర్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. మెల్లగా ఆసుపత్రిలో చికిత్స పొంది 2017లో స్పృహలోకి వచ్చాడు. అయితే ఇటీవలే ఫిజియోథెరపీతో కోలుకున్న అతను.. తన మనవడు రవి తో ‘నేను 1990లో 20 వేల ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్నాను. ఆ కాగితాలు ఉన్నాయా?’ అని అడిగాడు. దీనితో ఆశ్చర్యానికి గురైన మనవడు రవి.. ఇల్లంతా వెతికి ఆ కాగితాలను తీసుకొచ్చాడు. అనంతరం ఒక బిజినెస్ ఛానల్ ను సంప్రదించి వారి దగ్గర ఉన్న షేర్లను నగదు రూపంలో మార్చేందుకు సలహాలు అడిగాడు. ముందుగా డీమ్యాట్ అకౌంట్ తెరవాలని సూచించిన ఆర్థిక, షేర్ మార్కెట్ నిపుణులు.. ఆ తర్వాత ఈ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోవాలని వివరించారు. అనంతరం వారి దగ్గర ఉన్న పేర్ల విలువ తెలుసుకున్న రవికి మతి పోయింది. ఎంఆర్ఎఫ్ ఒక్కో షేర్ విలువ మార్కెట్ లో రూ.64,900గా ఉందనీ, ఈ లెక్కన రవి దగ్గర ఉన్న 20 వేల షేర్ల విలువ రూ.130 కోట్ల వరకూ ఉంటుందని తెలుసుకొన్న రవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.