టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. దివంగత నేత కోడెల శివప్రసాద్పై పెట్టిన కేసుల విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలని ఆళ్లగడ్డలో తమపై రాజకీయ దాడులు చేస్తున్నారని అఖిల ప్రియ కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.అఖిల ప్రియ ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాటిని పరిశీలిస్తామన్నారు.