గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2009, 2014లో చిత్తూరు లోక్సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. సినీనటుడిగా రాణించిన శివప్రసాద్.. తెదేపా హయాంలో మంత్రిగానూ వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై పార్లమెంటులో వివిధ వేషాధారణలతో నిరసన తెలిపారు.