ఈ ఏడాది డిసెంబరు-21న విశాఖపట్నంలో అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానం నిర్వహించనున్నట్టు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలిపింది. అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి సందర్భంగా అమెరికాలోని ఢల్లాస్లో జరిగిన సమావేశంలో ఈసారి పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, ఏఎ్ఫఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి, ప్రతినిధులు ప్రకటించారు. విద్యారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్ ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, సినీరత్న పురస్కారాన్ని ‘మహానటి’ చిత్ర బృందానికి, వ్యాపార రత్న పురస్కారం నిర్మాణ రంగంలోని ప్రముఖ వ్యాపారి సూరపనేని విజయ కుమార్, రంగస్థల రత్న పురస్కారాన్ని కూచిపూడి నర్తకి పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, వైద్యరత్న పురస్కారాన్ని డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సేవారత్న పురస్కారం ‘మన కోసం మనం ట్రస్ట్’ చల్లపల్లి, వినూత్నరత్న పురస్కారం పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ సత్తిరాజు శంకర నారాయణ, యువరత్న పురస్కారం సాహసవీరుడు ఫణికెర క్రాంతి కుమార్లకు అందించనున్నట్టు ప్రకటించారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని సినీ ప్రముఖుడు మురళీ మోహన్కు ప్రకటించారు.