తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బా రెడ్డిని వచ్చే ఆదివారం నగరంలో సత్కరించనున్నట్లు వై.ఎస్.ఆర్.కుటుంబం సంస్థ అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడి హెచ్.ఎస్.ఆర్ లే అవుట్లోని వైట్ హౌజ్ లో సన్మానం జరుగుతుందని వివరించారు. సత్కార సభకు కావలి శాసన సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. మంత్రి శ్రీ రాములు, మాజీ మంత్రి రామలింగారెడ్డి, శాసన సభ్యులు సతీశ్ రెడ్డి, అరవింద లింబావళి, రఘు, రాజ్యసభ సభ్యులు కె.సి.రామమూర్తి, కుపేంద్ర రెడ్డి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు వై.వి.సుబ్బారెడ్డి నగరంలోని తితిదే సమాచార కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం మూడు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి యడ్యూరప్పతో భేటీ అవుతారని చెప్పారు.