ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనార్ధం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తిరుమలకు చేరుకున్నారు. నాని నిజపాద దర్శన సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదఆశీర్వచనం పొందాడు.తదనంతరం ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో మంత్రిని సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా త్వరలోనే తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆలయం వెలుపల విజయవాడకు చెందిన మాజీ ఎంపీ రామకృష్ణ 6 లక్షల రూపాయలు విలువ చేసే గూడ్స్ వాహనాన్ని మంత్రి నాని, చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా టిటిడికి విరాళంగా ఇచ్చారు.