విజయవాడలోని ప్రభుత్వ విద్యాలయాల్లో డెంగ్యూ లక్షణాలు రాకుండా ముందస్తుగా.. జయశ్రీ ఫౌండేషన్ నిర్వాహకురాలు కొల్ల జయశ్రీ గురువారం మందు బిల్లలను అందచేశారు. అనంతరం వ్యాధి లక్షణాలు రాకుండా.. ఇంటి దగ్గర కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాద్యాయులు మరియు జయశ్రీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.