అమరావతి : నేడు తెదేపా అధినేత చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్ను పరామర్శించనున్నారు. గత కొంతకాలంగా శివప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు శివప్రసాద్ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు.