పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం విఆర్ఓ కార్యాలయం పై ఏసిబి అధికారులు దాడులు చేశారు. వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… సోడెం ముక్కయ్య అనే రైతు పొలానికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వి.ఆర్.ఓ. బొరగం వినయ్ కుమార్ రూ.20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. గురువారం రైతు నుంచి వీఆర్ఓ రూ.18వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పి సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.