ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసాపురంలో పిచ్చికుక్క భీభత్సం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2019, 04:19 PM

పశ్చిమగోదామరి, నరసాపురం గ్రామ వీధుల్లో వెళ్లేవారిని భయభ్రాంతులకుగురి చేసిన పిచ్చి కుక్క కనిపించిన వారినల్లా కరిచింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. ముందుగా పంజా సెంటర్‌లో నలుగరిని కరిచింది. దీంతో వారు కేకలు వేశారు. పిచ్చికుక్కను స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు.అయితే అది పారిపోతూ అధికారి వారి వీధి పార్క్‌రోడ్‌లో మరో 11 మందిని గాయపరిచింది. ఈసమాచారం తెలుసుకున్న వెంటనే పురపాలక సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. గాయపడిన వవారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పిచ్చి కుక్కను పట్టుకునేందుకు అధికారులు శానిటరీ సిబ్మందిని రంగంలోకి దింపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com