ప్రధాన నరేంద్ర మోడీ సర్కార్... ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం అమలు దిశగా అడుగులు వేస్తోంది.. అదే సమయంలో ఒకే దేశం-ఒకే భాష అనే తరహాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన షా.. దేశమంతా ఒకే భాష ఉండాలన్న ఉద్దేశాన్ని బయటపెట్టారు. 'హిందీని దేశభాషగా గుర్తించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అమిత్షా.. దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయని, ప్రతి భాషాకూ ఓ ప్రత్యేకత ఉందని.. కానీ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గుర్తింపునకు ప్రత్యేకంగా మరే ఒక సాధారణ భాషను కలిగి ఉండటం అవసరం' అన్నారు.