ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే దేశం..ఒకే భాష : అమిత్‌ షా ట్వీట్ వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2019, 03:36 PM

 


ప్రధాన నరేంద్ర మోడీ సర్కార్... ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం అమలు దిశగా అడుగులు వేస్తోంది.. అదే సమయంలో ఒకే దేశం-ఒకే భాష అనే తరహాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన షా.. దేశ‌మంతా ఒకే భాష ఉండాల‌న్న ఉద్దేశాన్ని బయటపెట్టారు. 'హిందీని దేశ‌భాష‌గా గుర్తించాల‌ని త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అమిత్‌షా.. దేశంలో ఎన్నో భాష‌లు ఉన్నాయ‌ని, ప్రతి భాషాకూ ఓ ప్రత్యేక‌త ఉంద‌ని.. కానీ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గుర్తింపునకు ప్రత్యేకంగా మరే ఒక సాధారణ భాషను కలిగి ఉండటం అవసరం' అన్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com