కర్నూలు: డీఆర్డీఓ తక్కువ బరువుతో కేవలం ఓ ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా తయారుచేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను పరీక్షించింది. ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఓర్వకల్లులోని పాలకొలను వద్ద ఆర్మీ సహకారంతో పరీక్ష చేయగా క్షిపణి పరీక్ష విజయవంతమై అనుకున్న సమయం ప్రకారం లక్ష్యాలను ఛేదించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఛేదించే లక్ష్యంగా తయారుచేసిన ఈ క్షిపణి రెండున్నర కిమీ దూరంలో లక్ష్యాలను ఛేదించింది.