రాష్ట్రంలో ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. మండలంలో ఉన్న హైస్కూల్ ను కాలేజీ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు లేనందునే ప్రయివేట్ కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదని, ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో వసతులు కల్పిస్తున్నామని, ప్రయివేట్ స్కూల్స్, కాలేజీలలో ఖచ్చితంగా వసతులు ఉండాలన్నారు. వచ్చే ఏడాది నుండి డెబ్భై వేలమంది ఇంగ్లీష్ మీడియం టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.