కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో మొహర్రం కార్యక్రమం లో అపశృతి.ఇంటి పై గోడ కూలి 15 మందికి గాయాలు.ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయంతో అటూ ఇటు పరుగులు తీశారు.క్షతగాత్రులకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మొహర్రం ఉరేగింపు చూస్తుండగా ఘటన. నిన్న రాత్రి పీర్ల పండగ సందర్భంగా గ్రామస్థులు అంతా నిప్పుల గుండంలో నడిచారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. పీర్ల చావిడి వద్ద ఇంటి పిట్టగోడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బరువు ఆపలేక గోడ కూలిపోయింది. దానిపైన ఉన్నవారంత కిందపడిపోయారు.బాధితులనుఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శించారు. వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.