టీడీపీ ఈనెల 11న ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ సభపై స్పందించిన హోంమంత్రి సుచరిత సభకు అనుమతి లేదని, అనుమతి కోరితే పరిశీలిస్తామని చెప్పగా తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ అసలు అనుమతి లేదని ప్రకటించారు. పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్న డీజీపీ ప్రస్తుతం అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉందని, టీడీపీ ఛలో ఆత్మకూరుతో వాతావరణం చెడగొట్టే పరిస్థితి రాకూడదన్నారు. పల్నాడు ప్రాంతంలో దాడులపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేస్తుందని, ఆ ప్రాంతంలో ఊరేగింపులు, ఆందోళనలకు అనుమతి లేదని, వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని డీజీపీ కోరారు.