రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజ్ నీటిమట్టం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గణనీయంగా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.10 అడుగులకు చేరుకోవడంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తివేసి దిగువకు 13 లక్షల 22 వేల 245 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.గంటకు గంటకు క్రమేపీ పెరుగుతుండటంతో భయాందోళనలో కోనసీమలో లంక గ్రామ ప్రజలు.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల ప్రజలు. జల దిగ్బంధం తూర్పు ఏజెన్సీలోని విలీన మండలాలు, దేవీపట్నం మండలం కి సంబంధించిన పలు గ్రామాలు.. కోనసీమలో పలు లంక గ్రామాలు.వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు...