పోలవరం వద్ద 21 మీటర్లకు వరద నీరు చేరింది. కొత్తూరు కాజ్వేపైకి వరద నీరు చేరడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద ముంచెత్తింది. కుక్కునూరు- దాచారం వంతెనపైకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయలంక కాజ్వేపై 5 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.