ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తూరు కాజ్‌వేపైకి వరద నీరు.. 19 గ్రామాలకు రాకపోకలు బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2019, 12:47 PM

పోలవరం వద్ద 21 మీటర్లకు వరద నీరు చేరింది. కొత్తూరు కాజ్‌వేపైకి వరద నీరు చేరడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద ముంచెత్తింది. కుక్కునూరు- దాచారం వంతెనపైకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయలంక కాజ్‌వేపై 5 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుంది. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com