జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బియ్యంలో నాణ్యత లోపించటంపై విమర్శలు వస్తున్నాయి. మెలియాపుట్టి మండలం కరజాడ, కవిటి మండలం నెలవంకలో పురుగులు, గడ్డ కట్టిన బియ్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. సంచులకే నాణ్యత పరిమితమైందంటూ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు.