ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం లేని రాష్ట్రం గా ఎపి ని తీర్చిదిద్దాలనే లక్ష్యం : మంత్రి నారాయణ స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 03:29 PM

వాణిజ్య పన్నులు శాఖ అధికారులు తో సమీక్ష నిర్వహించిన  మంత్రి నారాయణ స్వామి .మంత్రి మీడియా తో మాట్లాడుతూ ..కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో వివిధ అంశాల పై చర్చించాను .రిటర్న్ ఫైల్స్ అనేది ఎంత వరకు చేస్తున్నారో  కూడా రివ్యూ చేశాం.ప్రతి జిల్లాలో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలి. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి.. అనుమతులు ఇస్తే  బోగస్ సంస్థలు ఉండవు. ఎక్కడా కూడా ఇబ్బందులు పెట్టకుండా పాత బకాయిల కోసం ఒన్ టైం సెటిల్మెంట్ చేయాలని భావిస్తున్నాం. ఐదు వేల కోట్లకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయి..  న్యాయ నిపుణులు తో చర్చిస్తాం. ఆగష్టు నెల వరకు  22,464.42 కోట్లు ఉండగా.. 18.859 కోట్లు రీచ్ అయ్యాం. అధికారులు సిబ్బంది బాగా పని చేస్తున్నారు.. టార్గెట్ రీచ్ అవుతారని‌ భావిస్తున్నాం


విజయవాడ 2, వైజాగ్, ఏలూరు, కర్నూలు  ప్రాంతాలలో 91శాతం టార్గెట్ రీచ్ అయ్యారు. కడప, విజయవాడ1, గుంటూరు బాగా వెనుకబడ్డాయి. నాటు సారాను పూర్తి గా అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతవరకు కాపు సారా కాసే లేబర్ పైనే కేసులు పెట్టేవారు. ఇప్పుడు మా ప్రభుత్వం నిర్వాహకుల పై కేసులు నమోదు చేస్తుంది. గతంలో చంద్రబాబు కు నేను లేఖ రాసినాపట్టించుకోలేదు. నాటు సారా అరికట్టడంలో సిఎం జగన్ సఫలం అయ్యారు


జగన్ కు పేరు వస్తుందనే అక్కసుతో ప్రతిపక్షం  రాజకీయ కోణంలో చూడొద్దు. పత్రికలు, మీడియా కూడా మద్యపాన నిషేధం‌ పై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి సహకారం అందించాలి. ప్రభుత్వ పరంగా నిజంగా  తప్పులు ఉంటే  రాసుకోండి. మద్యం లేని రాష్ట్రం గా ఎపి ని  తీర్చిదిద్దాలనే లక్ష్యం తో సిఎం పని చేస్తున్నారు. మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలను పాఠ్యాంశాలలో పొందు పరుస్తాం. గత ప్రభుత్వం కేవలం ఆదాయమే లక్ష్యం గా పని చేసింది. మాది ప్రజల ప్రభుత్వం.. మాకు ఆదాయం కన్నా సంక్షేమం ముఖ్యం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com