ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి చెందిన ప్రజావేదిక కూల్చి జగన్ పాలన ప్రారంభించారు : అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 02:28 PM

2014లో రాష్ట్ర పరిస్థితి బట్టి అభివృద్ధి చేసే నేతగా  ప్రజలు నమ్మి చంద్రబాబు కు అవకాశం ఇచ్చారు. టీడీఎల్ఫీ నేత అచ్చెన్నాయుడు మీడియా తో మాట్లాడుతూ ...5 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో జగన్ ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బాబుకంటే కంటే జగన్ మంచి పాలన ఇస్తారని భావించి జగన్ కు 151 సీట్లు గెలిపించిన విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 100 రోజులు పూర్తి అయ్యిన జగన్ ప్రభుత్వం తుగ్లక్ పాలన లాగా కనిపిస్తుంది. ఇలాంటి నేత సీఎంగా ఉండడం మాకు అదృష్టంగా బావిస్తున్నాము. ప్రభుత్వానికి చెందిన ప్రజావేదిక కూల్చి జగన్ పాలన ప్రారంభించారు


కూల్చివేతలతో ప్రారంభమైన జగన్ పాలన 5 ఏళ్లపాటు ఇబ్బందుల్లో ఉంటుందని నేను అప్పుడే చెప్పాను. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గత ప్రభుత్వ పథకాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దులు, రివేర్స్ లు, పథకాలు అపహాస్యం చేయడమే జగన్ ప్రభుత్వం చేస్తుంది. అన్నా క్యాంటీన్, ఉచిత ఇసుక, నిరుద్యోగ భృతి రద్దు చేశారు


పోలవరం టెండర్లు రద్దు చేశారు. 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఉన్న పరిస్థితి పీపీఏ లపై సమీక్షలు చేసి కరెంట్ ఇబ్బందులు తీసుకువచ్చారు. ఎక్కడైనా నేను చర్చకు వస్తాను. ఈ అంశంపై అయ్యినా నేను వైసీపీ వారితో చర్చకు సిద్ధమా. టీడీపీ ప్రభుత్వం అవినీతి కోసం 100 రోజులుగా కష్టపడి ఏమీ లేక ఛతికిలపడ్డారు. అవగాహనలేని పాలన ఆంద్రప్రదేశ్ లో ఉందని ఒక పారిశ్రామిక వేత్త అనడం చాలా బాధగా ఉంది. 100 రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?. వాలంటీర్ల కూడా పనిచేయమని అంటున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. నిన్న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి ఏమి చేశారు. జగన్ చేసిన పనులకు శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు చంకలు గుడ్డుకుంటున్నారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com