అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. జిల్లాలోని కల్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల దానిమ్మచెట్లను గుర్తు తెలియని వ్యక్తలు నరికివేశారు. బ్రహ్మసముద్రం మండలం ఎర్రకొండాపురంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నేత సింగిల్ విండో అధ్యక్షుడు రామాంజనేయులు, టీడీపీ మాజీ జడ్పిటీసీ గంగమ్మ మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ పరిణామల మధ్య ఈ ఘటన జరగడంతో ఇది వైసీపీ నేతల పనేనని టీడీపీ ఆరోపిస్తోంది.