సైకిల్ దిగి మరో పార్టీ కండువా కప్పుకుంటారని వార్త పై స్పందించిన టీడీపీ ఫైర్ బ్రాండ్ .ఇటీవలే చంద్రబాబును కలసిన యామిని.మళ్ళీ యాక్టీవ్ కావాలని అధినేత సూచన వ్యకిగత కారణాల వల్లే మౌనంగా ఉన్నానన్న యామిని.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరును గమనిస్తున్న అని యామిని అన్నారు.ఏపీ ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై మాటల తూటాలు పేల్చిన ఏపీ టీడీపీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని ప్రస్తుత రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆమె సైలెంట్ అయ్యారు. బీజేపీలో యామిని చేరుతున్నారని, వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు అని అందుకే టిడిపి యాక్టివిటీస్ కు యామిని దూరంగా ఉంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా దానిపైన సాదినేని యామిని స్పందించలేదు.