భారత్ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. వ్లాదివొస్టోక్లో ఇవాళ ఆయన ఆదేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తనకు ఆహ్వానం పంపినందుకు పుతిన్కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోదీ అన్నారు. 2001లో జరిగిన వార్షిక సమావేశాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రధాని అటల్జీ బృందంలో గుజరాత్ సీఎంగా తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. రష్యా, భారత్ మధ్య స్నేహబంధం రోజు రోజుకూ బలపడుతోందని మోదీ అన్నారు. చెన్నై నుంచి వ్లాదివొస్టోక్ మధ్య పూర్తి స్థాయి సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు మోదీ అన్నారు. అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని ఇరు దేశాలు వ్యతిరేకిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంతకముందు జ్వెజ్దా షిప్యార్డును మోదీ సందర్శించారు. ఈ షిప్యార్డుతో ఆర్కిటిక్ షిప్పింగ్ అభివృద్ధి చెందుతుందని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. నౌకాశ్రయంలో ఉన్న అద్భుత టెక్నాలజీని పుతిన్ తనకు చూపించినట్లు ఆయన చెప్పారు.