విజయవాడ : ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో గుంటూరు రూరల్ ఎస్పీతో మాట్లాడిన మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. కులం పేరుతో దూసినవారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరిన వాసిరెడ్డి పద్మ.మహిళ కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ..తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలి..మహిళ దళిత ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సమాన్యులకు ఏముంటుంది..అంటరానితనాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడ్డం శిక్ష కరమైన నేరం..దళిత ఎమ్మెల్యే దేవుడు దగ్గరకు వెళ్తే మైల పడతారని మాట్లాడడం ప్రజా స్వామ్య, రాజ్యాంగ విరుద్ధం..